జాతీయ వార్తలు
ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా:సురేశ్ప్రభు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 June 2016
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రైల్వేశాఖ మంత్రి సురేశ్ప్రభు హామీ ఇచ్చారు. శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఎన్నికకు సహకరించిన తెలుగుదేశం పార్టీ అధినేతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.
సమస్యలు ప్రస్తావిస్తా: టిజి
ఏపీ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావిస్తానని టిజివెంకటేష్ అన్నారు. రాజ్యసభకు ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తరువాత ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాజ్యసభలో ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు.