ఖమ్మం

అశృనయనాల మధ్య సంగం అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం రూరల్, జూన్ 3: మండలంలోని గూడూరుపాడు గ్రామంలో టిఆర్‌ఎస్, సిపిఐ వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో మరణించిన సత్తి సంగం (60) అంత్యక్రియలు శుక్రవారం అశృనయనాల మధ్య జరిగాయి. టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి బుడాన్ బేగ్, డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు, మండల నాయకులు మద్ది మల్లారెడ్డి, రామ్మూర్తినాయక్, జెడ్పీటిసి భారతి, బెల్లం వేణు తదితరులు సంగం భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. ఆయన ఆశయం కోసం కృషి చేస్తామని నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం అంత్యక్రియలను ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్‌పి సాయికృష్ణ తదితర పోలీస్ అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.