పశ్చిమగోదావరి
బ్యాంకు మేనేజర్పై వేధింపుల కేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 June 2016
మొగల్తూరు, జూన్ 7: బ్యాంకు రుణం మంజూరు చేసినందుకు తన కోరిక తీర్చమని వేధించిన స్టేట్ బ్యాంకు మేనేజర్పై కేసు నమోదు చేసినట్టు మొగల్తూరు ఎస్సై డిజె రత్నం మంగళవారం విలేకర్లకు తెలిపారు. ఆయన కథనం ప్రకారం మొగల్తూరుకు చెందిన ఒక మహిళ మొగల్తూరు స్టేట్ బ్యాంకులో కాపురుణం కోసం దరఖాస్తు చేసుకోగా లక్ష రూపాయలు మంజూరైందన్నారు. రుణం మంజూరు చేసినందుకు ఆమెను బ్యాంకు మేనేజర్ కెవియస్యన్ ప్రసాద్ తన కోరిక తీర్చమని వేధింపులకు గురిచేశారన్నారు. వేధింపులు భరించలేని ఆమె బ్యాంకు మేనేజర్ సంభాషణను సెల్ఫోనులో రికార్డు చేసిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రత్నం చెప్పారు.