కడప

ప్రజాధనాన్ని వృథా చేస్తున్న సిఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, జూన్ 7: ముఖ్యమంత్రి చంద్రబాబు నెలకోసారి జిల్లాకు వస్తున్నారు.. కానీ జిల్లాకు చేసిందేమీ లేదని అనవసరంగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు. మంగళవారం సుండుపల్లె మండలంలోని వాయల్పాటివాండ్లపల్లె దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కాత్యాయని మోడ్రన్ స్కూల్‌ను మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నెలకోసారి జిల్లాకు వస్తున్నారు కానీ జిల్లాకు చేసిందేమీ లేదని అనవసరంగా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. చేతనైతే ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహాయం చేయాలని, ఇంకుడు గుంతలు, జన్మభూమి అనే అనాగరిక పనులు చేయకూడదని ఆయన తెలిపారు. దమ్ముంటే ఢిల్లీలో నవనిర్మాణదీక్ష చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఆరంరెడ్డి, యూత్ యూనియన్ లీడర్ అబ్దుల్లాఅలీ, గిరిజన సంఘ నాయకుడు చంద్రానాయక్, సాంబ తదితరులు పాల్గొన్నారు.