చిత్తూరు

ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్తూరు, జూన్ 7: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం ఈ సేవను నిర్వహించడం టిటిడి ఆనవాయితీగా పాటిస్తూ ఉంది. ఈనెల 15నుంచి 23వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న విషయం పాఠకులకు విదితమే. మంగళవారం తెల్లవారుజామున సుప్రభాతం, తోమాల, కొలువు,పంచాంగ శ్రవణం నిర్వహించిన అనంతరం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు.అనంతరం గోడలకు నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు,గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిడీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. మధ్యాహ్నం 1.30 నుంచి భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇ ఓ చిన్నంగారి రమణ, సహాయ కార్యనిర్వాహణాధికారి రాధాకృష్ణ, సూపరింటెండెంట్ పవన్‌కుమార్, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.