కర్నూల్

రాష్ట్భ్రావృద్ధికి సిఎం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, జూన్ 7: సిఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కోసం అహర్శిశలు పాటుపడుతున్నాడని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. నవన నిర్మాణ దీక్షలలో భాగంగా స్ధానిక ప్రజ్ఞా కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రం రెండుగా విడిపోవడంతో ఎక్కువగా నష్టపోయింది రాయలసీమేనన్నారు. ఎపికి రాజధాని కోసం చంద్రబాబు పడుతున్న కష్టాలు ఎక్కువన్నారు. ముఖ్యమంత్రి రాజధాని కోసం చేపట్టిన దీక్షయే నవ నిర్మాణ దీక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో అందరం కలిసి చేయి చేయి కలిపి రాజధాని కోసం నడుం బిగించాలన్నారు. పేదల అభ్యున్నతికి టిడిపి నిరంతరం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లి అందరికి తెలియజేయాలన్నారు. ముస్లిం యువతులు వివాహానికి దుల్హన్ స్కీం కింద నెల ముందు దరఖాస్తు చేసుకుంటే 15 రోజులకు రూ. 50 వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. అంతకు ముందు ఆయా శాఖల అధికారులు ప్రసంగించారు. ఐసిడిఎస్ అధికారులు ఏర్పాటు చేసిన చిన్నారుల అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ విజయలక్ష్మి, ఎంపిపి బండి చంద్రుడు, నగర పంచాయితీ కమిషనర్ విజయసింహారెడ్డి, చైర్‌పర్సన్ ఎద్దుల ఉషారాణి, తహశీల్దార్ మాలకొండయ్య పాల్గొన్నారు.