విజయవాడ
ఘనంగా అమ్మవారి ప్రతిష్ఠాపన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 10 June 2016
పాయకాపురం, జూన్ 9: ఎంతో వైభవంగా గత 23 సంవత్సరాల నుండి స్థానిక ప్రకాష్నగర్ సెంటర్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రతిష్ఠాపన ఉత్సవం ఈ సంవత్సరం కూడా కన్నుల పండుగగా జరిగింది. గత 23 సంవత్సరాల క్రితం ఇదే రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరగడంతో గురువారం ఉదయం నుండి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీ కనకదుర్గ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకాలు, కుంభాభిషేకం, బోనాల్ని భక్తులు గావించారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ అమ్మవారి తీర్థ ప్రసాదాల్ని భక్తులకు అందజేశారు. ఈ ఉత్సవంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తాబాద వెంకటేశ్వరరావు, కార్యదర్శి జి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.