రంగారెడ్డి

కేంద్ర పథకాలు ప్రజలకు చేరవేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, జూన్ 9: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోరెడ్డి నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక బాలాజీగార్డెన్స్‌లో భాజపా అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల భాస్కర్ అధ్యక్షతన ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఆయన ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20, 22 తేదీలలో ఇబ్రహీంపట్నం కేంద్రంలో రెండేళ్ళ మోదీ పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్యఅతిధిగా భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నల్గొండ జిల్లా సూర్యాపేటలో భాజపా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగసభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరవుతున్నట్లు చెప్పారు. సభ విజయవంతానికి భాజపా శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బిజెపి దళితమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోసుపల్లి ప్రతాప్, గోగిరెడ్డి లచ్చిరెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర కార్యదర్శి అర్జున్‌రెడ్డి, నాయకులు భోజిరెడ్డి, కొప్పు బాష, మర్పల్లి అంజయ్య, దనె్న బాషయ్య, నాయిని సత్యనారాయణ, గుర్రం శ్రీనివాస్, బి రాంరెడ్డి, పాపయ్య, శ్రీశైలం, గణేష్, గోవర్ధన్, రాజు, జగదీశ్, టేకుల రాంరెడ్డి, బండి మహేష్ పాల్గొన్నారు.