తూర్పుగోదావరి

పోలీసుస్టేషన్‌లో అక్రమ ప్రవేశంపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 9: అమలాపురం పోలీస్ స్టేషన్‌లో అక్రమంగా ప్రవేశించిన కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంతోపాటు 11 మందిపై కేసులు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు. మంగళవారం ఉదయం ముద్రగడతోపాటు పలువురు కాపు నాయకులు పోలీస్‌స్టేషన్‌ను చేరుకుని స్టేషన్‌లో బైఠాయించడం, వారిని నాటకీయ పరిణామాల మధ్య కిర్లంపూడి తరలించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో సంబంధం ఉన్న ముద్రగడతోపాటు కల్వకొలను తాతాజీ, నల్లా విష్ణు, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి ఏసుదాసు, మిండగుదిటి మోహన్, నల్లా పవన్, నల్లా అజయ్, గోపు అచ్యుతరామయ్య, సూదా గణపతిలతో పాటు అల్లర్లకు పాల్పడిన మరో 34 మందిపై కేసులు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు. అలాగే ఆరోజు వాహనాన్ని అడ్డగించడం, వాహనంపై రాళ్లు రువ్వడం, పోలీసుస్టేషన్‌ను ముట్టడించడం వంటి సంఘటనలకు పాల్పడిన మరో 150 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు.