తూర్పుగోదావరి

నిఘా నీడలో కిర్లంపూడి: అప్రకటిత కర్ఫ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, జూన్ 9: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షతో కిర్లంపూడి, ప్రత్తిపాడు ప్రాంతాలు పోలీసు నిఘా నీడలోకి వెళ్లాయి. ప్రత్తిపాడు నుండి కిర్లంపూడికి వెళ్లేవారిని పోలీసులు తనిఖీలు చేసి మరీ పంపిస్తున్నారు. ప్రత్తిపాడు గ్రామంలోకి కూడా ఎవ్వరూ రాకుండా బైపాస్ నుంచే పంపిస్తున్నారు. చివరకు బస్సులు కూడా రానీయలేదు. ప్రత్తిపాడు నుంచి కిర్లంపూడికి వెళ్లే మార్గంలో పోలీసులు క్యాంపులు ఏర్పాటు చేశారు. కిర్లంపూడిలో అయితే ఏకంగా బెటాలియన్లకు బెటాలియనే్ల దిగాయి. ముద్రగడ ఇంటికి రెండుపక్కలా పూర్తిగా దిగ్బంధించారు. ఇంట్లోకి ఎవ్వరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆమరణదీక్ష చేస్తున్న ముద్రగడ దంపతులను ఎవ్వరినీ కలవనీయకుండా ఆంక్షలు విధించారు. ఇక ముద్రగడ అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మీడియా ప్రతినిధుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని నెట్‌వర్కుల సెల్‌ఫోన్లు పనిచేయకుండా చేశారని కూడా పలువురు ఆరోపించారు. ఇక పోలీసు నిఘా వర్గాలు తిష్ఠవేశాయి.