చిత్తూరు

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, జూన్ 9: శ్రీ వేంకటేశ్వర స్వామిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్‌పర్సన్ హెచ్ ఎల్ దత్తు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ దర్శన సమయంలో శ్రీవారి దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు మహద్వారం వద్ద తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఇ ఓ రామారావు పట్టువస్త్రాలు, శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు రిసెప్షన్ డిప్యూటీ ఇ ఓ హరీంద్రనాథ్, ఓ ఎస్ డి లక్ష్మి నారాయణ యాదవ్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.