అనంతపురం
తేనెటీగల దాడి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 June 2016
ఉరవకొండ, జూన్ 10 : తేనెటీగలు దాడి చేయడంతో పదిమంది గాయపడిన సంఘటన మండలంలోని పెన్నోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న బగరిగుండ్లలో శుక్రవారం చోటు చేసుకుంది. మండలంలోని మోపిడి, అనంతపురం తదితర గ్రామాల నుంచి అనేక మంది భక్తులు బగరిగుండ్ల వద్ద ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద దాసంగాలు పెట్టడానికి చేరుకున్నారు. అయితే అక్కడే ఉన్న కొంతమంది చెట్లపై ఉన్న తేనెటీగల తట్టపై రాళ్లు వేయడంతో తేనెటీగలు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో మోపిడి గ్రామానికి చెందిన సరస్వతి, కొట్టాలపల్లికి చెందిన లక్ష్మీదేవి, ఉరవకొండకు చెందిన ఆదినారాయణ, అనంతపురం పట్టణానికి చెందిన చక్రవర్తితో పాటు మరి కొంతమంది గాయపడ్డారు. గాయపడిన వారిని అనంతపురం, ఉరవకొండ ఆసుపత్రులకు తరలించారు.