గుంటూరు

వర్ష బాధితులకు పరిహారం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృతలూరు, జూన్ 10: రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా ప్రజా సంక్షేమం దిశగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని వేమూరు శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఈనెల 4న పెనుగాలులతో వచ్చిన భారీ వర్షాలతో మండల గ్రామాలలో 72గృహాలు పూర్తిగా పడిపోయి నష్టం వాటిల్లింది. ఈసందర్భంగా బాధిత కుటుంబాల శ్రేయస్సుకోరి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తహశీల్దార్ అంకారావు ఆధ్వర్యంలో ఆయాగ్రామాల విఆర్‌ఓలు నివేదిక తయారుచేసి కలెక్టర్‌కు పంపారు. ప్రభుత్వం నుండి ఒక్కొక్క బాధిత కుటుంబానికి 5వేల రూపాయలు, 20కేజీల బియ్యం శుక్రవారం మంజూరుచేయిగా ఎమ్మెల్యే చేతులమీదగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి బొంతా నాగమల్లేశ్వరి, ఎంపిడిఓ శ్రీనివాసులు, మండల టిడిపి అధ్యక్షుడు వై బ్రహ్మానందం పాల్గొన్నారు.