విజయనగరం
వైకాపాలో చేరిన బొబ్బిలి కాంగ్రెస్ నాయకులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 June 2016
విజయనగరం(టౌన్), జూన్ 10: జిల్లాలో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అందరు కలసి పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి తెలిపారు. బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మజ్జిశ్రీనివాసరావు నాయకత్వంలో శుక్రవారం జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి గోపాలరావు, మున్సిపల్ కౌన్సిలర్లు ఈశ్వరరావు, ఆప్పారావు, మాజీ కౌన్సిలర్లు సాహూ, కృష్ణమూర్తి, గోవిందరావు, ఉమామహేశ్వరరావు, కృష్ణారావులకు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయనగరం నాయకులు ఒమ్మి శ్రీను, గోపి పాల్గొన్నారు.