అనంతపురం
కలకలం రేపిన తండ్రీకొడుకుల హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తనకల్లు, జూలై 28: మండల పరిధిలోని కొక్కంటి క్రాస్లో గురువారం సంచార జాతికి చెందిన వారు ఘర్షణ పడడంతో తండ్రి గుర్రప్ప (70), కొడుకు కొట్రసి (27) మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కళ్యాణదుర్గంకు చెందిన గుర్రప్ప, కొట్రసిలు కలిసి నెల రోజుల క్రితం కొక్కంటి క్రాస్ వద్ద గుడారాలు వేసుకొని వెంట్రుకలు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరితోపాటు మరికొంతమంది అక్కడ గుడారాలు వేసుకొని ఉన్నారు. ఇరు వర్గాలు మద్యం సేవించిన మత్తులో డబ్బుల కోసం గొడవపడి కత్తులతో రమేష్ కుమారులు గుర్రప్ప, కొట్రసిలపై దాడి చేశారు. దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. పరస్పర దాడుల్లో రమేష్, నటరాజ్లు తీవ్రంగా గాయపడ్డారు. దాడి చేసిన వారు అక్కడి నుండి పారిపోయారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని కాశీపురం వాసులని బాధితులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ రవికుమార్ సిబ్బందితో కలిసి పరిశీలించారు.