మెదక్

ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 31: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను దృష్టిలో పెట్టుకొని పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నట్లు డిజిపి అనురాగ్ శర్మ పేర్కొన్నారు. ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కోమటిబండలో హెలీప్యాడ్, బహిరంగ సభ, మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పోలీస్ సిబ్బంది పనితీరు బాగుందని, 3500 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పోలీసులను ప్రజల పోలీసులుగా తీర్చిదిద్ది సామాజిక సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అలాగే వివిధ సంస్కరణలు తీసుకురావడంతోపాటు పోలీసు నియామకాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. కాగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి సైతం పోలీసులు చేయూతనిస్తూ మొక్కలు నాటడంలో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఐజి అకుల్‌సబర్వాల్, ఎస్పి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.