కర్నూల్

బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాములపాడు, జూలై 31:శ్రీశైలం మండల పరిధిలోని సున్నిపెంట గ్రామానికి చెందిన రహిమాన్(36) ఆదివారం బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. రహిమాన్ శ్రీశైలం జలాశయంలోని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను కలిపే లింగాలగట్టు బ్రిడ్జి వద్ద సూమారు 50 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున జరిగినట్లు పోలీసులు తెలిపారు. రహిమాన్ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహిమాన్ టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడని బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై శ్రీశైలం టూ టౌన్ ఎస్‌ఐ ఓబులేసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.