క్రీడాభూమి

యోగేశ్వర్‌కు స్వర్ణం ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: లండన్ ఒలింపిక్స్‌లో నాలుగేళ్ల క్రితం భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ సాధించిన కాంస్య పతకాన్ని పసిడి పతకానికి అప్‌గ్రేడ్ చేయడం లేదని యుడబ్ల్యుడబ్ల్యు (యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్) మంగళవారం స్పష్టం చేసింది. లండన్ ఒలింపిక్స్ పురుషుల 60 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలుచుకున్న రష్యా రెజ్లర్ బెసిక్ కుదుఖోవ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో యోగేశ్వర్ పతకాన్ని ఇటీవల రజతానికి అప్‌గ్రేడ్ చేసిన విషయం విదితమే. అయితే ఈ ఈవెంట్‌లో విజేతగా విజేతగా నిలిచి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న అజర్‌బైజాన్ రెజ్లర్ టొగ్రుల్ కూడా డోపింగ్ పరీక్షలో విఫలమైనట్లు వార్తలు రావడంతో యోగేశ్వర్ పతకాన్ని స్వర్ణ పతకానికి అప్‌గ్రేడ్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ అస్గరోవ్ నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్లు డోపింగ్ పరీక్షలో ఎన్నడూ తేలలేదని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) మంగళవారం ధ్రువీకరించింది. దీంతో యోగేశ్వర్ దత్ సాధించిన పతకాన్ని స్వర్ణానికి అప్‌గ్రేడ్ చేసే ప్రశే్న లేదని యుడబ్ల్యుడబ్ల్యు ఒక ప్రకటనలో వెల్లడించింది.