జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో మరో ఉగ్రదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, అక్టోబర్ 7: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ లక్షిత దాడుల అనంతరం జమ్ము కాశ్మీర్‌లో భద్రతాదళాలను లక్ష్యం చేసుకుని సాగుతున్న ఉగ్రదాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. సోఫియాన్ జిల్లాలో ఓ పోలీస్ గార్డ్ పోస్ట్‌పై శుక్రవారం రాత్రి 8.30 తరువాత మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. మిలిటెంట్లు పారిపోయారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. గాయపడిన కానిస్టేబుల్‌ను ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.