జాతీయ వార్తలు

మధ్యప్రదేశ్‌లో గోతిలో పడిన బస్సు 17మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్లాం, అక్టోబర్ 14: మధ్యప్రదేశ్‌లో ఓ ప్రైవేటు బస్సు భారీ నీటిగుంతలో పడిపోవడంతో 17మం ది దుర్మరణం చెందారు. మరో 13మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. రత్లాం నుంచి జోరాకు వెళుతున్న ఈ బస్సు డ్రైవర్ అదుపుకోల్పోవడంతో రో డ్డు పక్కన వున్న భారీ నీటి గుంతలో పడిపోయింది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మట్టిని తవ్వడంతో ఏర్పడిన ఈ పెద్ద గొయ్యి వర్షపు నీటితో నిండిపోయింది. వేగంగా వెళుతున్న ప్రైవేటు బస్సు నాలీ సమీపంలోకి రాగానే అదుపుతప్పి నీటి గుం తలో బోర్లాపడిపోయినట్లు రత్లాం ఎఎస్‌పి ప్రశాంత్ చౌబే వెల్లడించారు. స్టీరింగ్‌పై డ్రైవర్ అదుపు కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ బస్సులో 40 నుంచి 45మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదవార్త తెలియగానే కలెక్టర్, ఎస్‌పి సహా ఇతర సీనియర్ అధికారులు ఘటనా స్థలిని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.