జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో 22మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, అక్టోబర్ 20: జమ్ముకాశ్మీర్‌లో గురువారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 22మంది దుర్మరణం చెందారు. గాయపడ్డ 30మందిలో అనేక మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 45మంది ప్రయాణికులతో రియాసీ నుంచి బకుల్ ప్రాంతానికి వెళుతున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని రియాసీ ఎస్‌ఎస్‌పి తాహిర్ సజాద్ భట్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని అసుపత్రులకు తరలించామని చెప్పారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, సహాయ చర్యల నిమిత్తం సిబ్బందిని తరలించామని చెప్పారు.