జాతీయ వార్తలు

14మంది భక్తుల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, నవంబర్ 5: గుజరాత్‌లోని అహమ్మదాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాల్తేరా పటియా గ్రామం దగ్గర ఒక ట్రక్ తీర్థయాత్రికులతో వెళ్తున్న మినీ బస్సును ఢీకొనడంతో మొత్తం 17మంది దుర్మరణం పాలయ్యారు. 14మంది అక్కడికక్కడే ప్రాణాలు వదలగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించాక చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం రాత్రి బాగా పొద్దు పోయిన తరువాత ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. రాజ్‌కోట్ జిల్లాలోని సోక్ధా వద్ద ఉన్న పావ్‌గధ్ పవిత్ర స్థలానికి వెళ్లి పూజలు నిర్వహించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ట్రక్ డ్రైవర్ పారిపోయాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. మృతులకు నివాళిగా సోక్ధాలో శనివారం బంద్ పాటించారు.