హైదరాబాద్

కాల్పులతో అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: నగరంలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. మాసాబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని శ్రీదుర్గా కనుమిల్లి అపార్ట్‌మెంట్‌లో ఆదివారం మధ్యా హ్నం బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగుడు ఓ వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపి పరారయ్యాడు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి కేబీఎస్ బ్యాంక్ సిఇఓగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఓ బ్యాంక్ సిఇఓపై కాల్పులు జరిపిన సంఘటన ఆదివారం నగరంలో కలకలం రేపింది. కేబిఎస్ బ్యాంక్ సిఈఓపై కాల్పులు జరిపిన ప్రాంతానికి వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దింపారు. బ్యాంక్ అధికారితో నిందితుడు ఏవైన లావాదేవీలకు సంబంధించి గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.