క్రీడాభూమి
ఫైనల్కు దూసుకెళ్లిన భారత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 3 January 2017
సిలిగురి, జనవరి 2: శాఫ్ మహిళల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. సిలిగురిలోని కాంచన్జంగా స్టేడియంలో సోమవారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు 3-1 గోల్స్ తేడాతో నేపాల్ను మట్టికరిపించి టైటిల్కు మరో అడుగు దూరంలో నిలిచింది. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టుకు కమలా దేవి 45వ నిమిషంలో తొలి గోల్ను అందించింది. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికి 1-0 ఆధిక్యత సాధించిన భారత జట్టుకు ఆ తర్వాత 58వ నిమిషంలో ఇందుమతి, 83వ నిమిషంలో సస్మిత చెరో గోల్ను సాధించి పెట్టగా, నేపాల్ జట్టుకు 75వ నిమిషంలో సబిత్రా భండారీ కంటితుడుపు గోల్ను అందించి కొంత మేరకు పరువు నిలబెట్టింది.