ఆంధ్రప్రదేశ్
గీతం వర్శిటీ మూర్తి కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 3 October 2018
![](http://andhrabhoomi.net/sites/default/files/styles/large/public/field/image/MVVS_Murthy.png?itok=p0lq5PH6)
విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈనెల 6న కాలిఫోర్నియాలోని గీతం యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన ప్రసంగించవలసి వుంది. మంగళవారం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని అంకరేజ్ సఫారిని సందర్శించేందుకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న వ్యానును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరు ప్రయాణిస్తున్న వాహనంలోని బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి మృతిచెందగా కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడ్డారు.