రాష్ట్రీయం
అనంతలో 146 మంది జీవిత ఖైదీలకు విముక్తి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 January 2016
బుక్కరాయసముద్రం, జనవరి 21: అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న సుమారు 146 మంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకోనున్నారు. ఖైదీల విడుదలపై ఇటీవల ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని ఆయా జైళ్ల అధికారులు జీవిత ఖైదీల వివరాలను ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే వారిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా అనంతపురం వ్యవసాయ ఆరుబయలు కారాగారంలో సుమారు 200 మందికిపైగా జీవితఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు ఖైదీల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే.