క్రైమ్/లీగల్

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసారూరల్, మే 18: మండలంలోని దేగాం గ్రామానికి చెందిన సట్ల లక్ష్మణ్ (32) గురువారం ఎప్పటిలాగే ఉపాధి పనులకు వెళ్లాడు. అయతే ఎండలు తీవ్రంగా ఉండడంతో ఏమీచేయలేకపోయాడు. దీంతో ఎండలో పనిచేస్తుండగా లక్ష్మణ్ కింద పడిపోయాడు. ఎండవేడిమికి తట్టుకోలేక పడిపోయాడని తోటి కూలీలు గుర్తించి ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు అందించారు. భైంసాలోని ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న లక్ష్మణ్ గురువారం రాత్రి మృతిచెందాడు. వడదెబ్బతో మృతిచెందిన ఉపాధికూలీ కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని తోటి కూలీలు డిమాండ్ చేశారు. మృతుడికి భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై గంగాధర్ తెలిపారు.