కృష్ణ

కేంద్ర మంత్రుల రాకతో కళకళలాడిన ఎయిర్‌పోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, డిసెంబర్ 5: ముగ్గురు కేంద్ర మంత్రులు శనివారం ఉదయం న్యూఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయానికి రావడంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కళకళలాడింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి సృజనా చౌదరి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు గన్నవరం ఎయిర్‌పోర్టుకు విచ్చేశారు. వెంకయ్యనాయుడు, సృజనాచౌదరీలు న్యూఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలోను, నితిన్ గడ్కరీ ప్రత్యేక విమానంలోను గన్నవరం చేరుకున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ బాబు ఎ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కె మాణిక్యాలరావు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, విజయవాడ, నరసాపురం ఎంపిలు కేసినేని నాని, గోకరాజు గంగరాజు, విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, డిప్యూటీ మేయర్ గోగుల రమణ, కృష్ణాజిల్లా సీఈఓ నాగార్జునసాగర్, ఆర్డీఓ చెరుకూరి రంగయ్య, తహశీల్దార్ ఎం మాధురి, సుబ్రహ్మణ్యస్వామిలు స్వాగతంపలికారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు చిగురుపాటి కుమారస్వామి, లక్ష్మీపతిరాజా, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తుమ్మల అంజిబాబు, అసెంబ్లీ ఇన్‌చార్జి నాదెండ్ల మోహన్, నెర్సు వెంకట శ్రీనివాసరావు, జయరాజు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరు గన్నవరం వచ్చారు. అనంతరం రోడ్డు మార్గాన విజయవాడకు తరలివెళ్లారు. కాగా ప్రముఖ సినీ హీరోయిన్ సమంత హైదరాబాద్ నుండి స్పైస్‌జెట్ విమానంలో గన్నవరం వచ్చి విజయవాడ వెళ్లారు.