అక్షర
ఇవి కథలు కాదు... హృదయ వ్యథలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
టాంక్బండ్ కథలు
-చంద్రప్రతాప్
వేదగిరి కమ్యూనికేషన్స్
వెల: రూ.100
**
విపుల, చతుర మాస పత్రికలకు సంపాదకులుగా ఉంటూ ప్రతినెలా మంచి కథలు, చక్కటి నవలలు తెలుగు సాహితీప్రియులకు అందిస్తున్న కంతేటి చంద్రప్రతాప్గారు స్వయంగా రచించిన కథలు టాంక్బండ్ కథలు.
టాంక్బండ్.. హుస్సేన్సాగర్ అలల మీదనుంచి వీచే చల్లనిగాలి, చుట్టు ప్రకృతి కన్యకు పట్ట్భాషేకం కట్టినట్టు నిలబడి ఉండే ఎతె్తైన భవనాలు ఇరువైపులా ప్రకృతి అందాలు ఇదీ టాంక్బండ్ చిత్రం. ఎందరో కవులకు, రచయితలకు భావోద్వేగాలను పంచిన టాంక్బండ్..
హైదరాబాదు అనగానే స్ఫురించే చార్మినార్, గోల్కొండ వంటి చారిత్రాత్మక స్థలాల్లో టాంక్బండ్ కూడా అత్యంత ప్రముఖమైనది.
విశాలమైన హుస్సేన్సాగర్ చెరువు ఒడ్డున ఓవైపు హైదరాబాదు సంస్కృతీ సంప్రదాయాలను కాపలాకాస్తూ, హైదరాబాదు చరిత్రను కథలు, కథలుగా పర్యాటకులకు చెబుతున్నట్టుగా హుందాగా, స్థిరంగా నిలబడి ఉన్న చరిత్రకారులు, నన్నయ, తిక్కన వంటి వైతాళికుల విగ్రహాలు, అక్కడక్కడా కళాత్మకత ఉట్టిపడే పచ్చని ప్రకృతిమధ్యలో విశాలమైన రోడ్డు, ఆ రోడ్డుమీద సాగిపోయే వివిధ రకాల వాహనాలు, డబల్డెక్కర్ బస్సులు.. ఆ అందం చెబితే తెలిసేది కాదు.. చూసితీరాలి. అలాంటి అందమైన చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశం చుట్టుపక్కల చారిత్రక గాథలే కాదు.. ఎన్నో జీవన వాస్తవాలు, అట్టడుగు, మధ్యతరగతి జీవన చిత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూసే హృదయం ఉండాలే కానీ, హుస్సేన్సాగర్ అలలమీద అనేక విషాద గాథలు కూడా కనిపిస్తూ ఉంటాయి.
ఈ సాగర్ ఒడ్డున ఎంతో మంది యువతీ, యువకులు ప్రేమ ఊసులు చెప్పుకున్నారో, ఎందరు ప్రేమికులు జీవితాల్ని ముడేసుకున్నారో, మరెందరు ప్రేమికుల జీవితాలు విషాదంగా ముగిసాయో!
అలాంటి వాటిలో కొన్ని సంఘటనలు కథలుగా మనకి ఈ సంపుటిలో అందించారు చంద్రప్రతాప్గారు.
ఈ సాగరగర్భంలో అనేక సంవత్సరాలుగా ప్రతి వినాయక చవితికీ కొన్ని లక్షల రూపాయల విలువైన విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంటుంది. ఇసకవేసినా రాలనంత జనం, ఆటలు, పాటలు, వినోదం కొండొకచో విషాదం.. గణేష్ మహారాజ్కి జై అనే నినాదాలు.. అప్పుడప్పుడు ఎగసిపడే ఆగ్రహజ్వాలలు, లాఠీచార్జీలు, మారణహోమాలు.
అలాంటి నిమజ్జనంరోజు -ఒకరోజు నిమజ్జనం- అనే వేడుక చూడడానికి తన నాలుగేళ్ల కొడుకుతో వస్తుంది రాములమ్మ. కన్నుల పండుగగా జరుగుతున్న ఆ వేడుక చూడడంలో లీనమై తన చేతులనుంచి జారిన కొడుకు సాగరంలో నిర్జీవుడై కనిపించడంతో గుండె పగిలిపోతుంది రాములమ్మకి. నిమజ్జనం రోజు అప్రమత్తంగా లేకుంటే ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి.
అర్జంట్ అనే కథలో ఇదే టాంక్బండ్ ఒడ్డున ప్రియురాలితో సరసాలాడుతూ భార్య ఫోన్చేస్తే ఆఫీసులో ఉన్నానని అబద్ధంచెప్పి కొన్ని పరిస్థితుల్లో నటించక తప్పదు అంటూ తనని తాను సమర్ధించుకున్న రాజశేఖర్ కొడుకు వేలు తెగింది అని చెప్పగానే ఆందోళనతో పరుగులు పెట్టడం తండ్రి మనసుని తెలియచేస్తుంది.
అలాగే ఆమె ఎందుకేడ్చింది అనే కథలో టాంక్బండ్ ఒడ్డున కాస్సేపు చల్లగాలి ఆస్వాదించడానికి వచ్చిన శంకర్రావు అక్కడే ఒంటరిగా ఏడుస్తూ నిలబడిన ఓ పదహారేళ్ల పిల్లని చూస్తాడు. ఆ పిల్ల ఎందుకేడుస్తోందో వాకబు చేయాలనుకునే లోగా ఒక ఆటోవచ్చి ఆ పిల్ల ముందు ఆగడం ఆ పిల్ల అందులో ఎక్కడం చూసి, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, మోసాలు, దగాలు గుర్తొచ్చి ఆ పిల్లని ఆటోవాడు ఎక్కడికి తీసికెళ్తున్నాడో అనే ఆందోళనతో మరో ఆటోలో వాళ్లని అనుసరిస్తూ వెళ్లిన శంకర్రావు ఆటోవాలా ఆ పిల్లని పోలీస్స్టేషన్లో అప్పగించడం చూసి ఆనందిస్తాడు. మహారాష్టన్రుంచి వచ్చి తప్పిపోయి ఎటుపోవాలో దిక్కుతోచక ఏడుస్తున్న ఆ పిల్లకి రాత్రంతా పోలీస్స్టేషన్లో ఆశ్రయం ఇస్తామన్న ఇన్స్పెక్టర్ మాటమీద కూడా నమ్మకంలేని శంకర్రావు తనింటికి తీసికెళ్తానంటాడు. ఇంతలో ఆ పిల్ల తల్లి, తండ్రుల ఆచూకీ లభించడంతో అందరూ రిలీఫ్గా నిట్టూరుస్తారు.. ఈ సమాజంలో ఇంకా మంచితనం బతికేఉందని తెలియచేసే కథ..
మొత్తం ఎనభై ఆరు కథలున్న ఈ సంపుటిలో ఉన్నవి కథలుకాదు... అనేకమంది హృదయాల వ్యధలు..