ఆంధ్రప్రదేశ్‌

వెలగపూడి సచివాలయంలో సందడి ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు జిల్లా వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం నుంచి ఉద్యోగుల సందడి మొదలైంది. సచివాలయం అయిదో నెంబర్ భవనం కింది అంతస్థును రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు హైదరాబాద్ నుంచి అయిదు ప్రత్యేక బస్సుల్లో సచివాలయ సిబ్బంది తరలివచ్చారు. కేవలం 131 రోజుల్లోనే పూర్తయిన అయిదో నెంబర్ భవనం నవ్యాంధ్ర చరిత్రలో పరిపాలనా పరంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఇక్కడికి చేరుకున్న ఉద్యోగులకు వెలగపూడి పరిసర గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఉద్యోగులు ఆనందంగా చెబుతున్నారు.