తెలంగాణ
అంబేద్కర్ జయంతి సభలో ఉద్రిక్తత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 14 April 2016
మహబూబ్నగర్ : అంబేద్కర్ జయంతి సభ సందర్భంగా షాద్నగర్లో గురువారం కొంతసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అంబేద్కర్ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసిన తర్వాత సిపిఎం నాయకుడు రాజు మాట్లాడుతూ, దళితులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ప్రతిస్పందిస్తూ రాజు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై దళిత సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేయడంతో ఘర్షణ వాతావారణం ఏర్పడింది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.