ఆంధ్రప్రదేశ్‌

కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బారాయుడు 28న బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 24: రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఈనెల 28తేదీ ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కోట్ల శివశంకరరావు మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఇదిలా ఉండగా ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కాపులను తరలించేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు.