ఆంధ్రప్రదేశ్‌

నేడు సీఎం వద్ద ఆళ్లగడ్డ పంచాయితీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: ఆళ్లగడ్డలో టీడీపీ నేతపై రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో మంత్రి అఖిలప్రియ, పార్టీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య రాజీకి సంబంధించిన సమావేశం గురువారానికి వాయిదా పడింది. మంత్రి, సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఇటీవలి కాలంలో మళ్లీ విభేదాలు తలెత్తడంతో వీరి వ్యవహారం పార్టీకి తలనెప్పిగా మారింది. ఈ పంచాయితీ చివరకు సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. వీరిద్దరి మధ్య విభేదాలకు తెరదించి మళ్లీ సయోధ్య కుదిర్చేందుకు బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. విజయవాడకు సుబ్బారెడ్డి చేరుకున్నప్పటికీ మంత్రి అఖిలప్రియ రాకపోవడంతో సమావేశాన్ని గురువారానికి వాయిదా వేశారు. ఈ సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం లేదంటూ మంత్రి అఖిలప్రియ కర్నూలు జిల్లాలో ఉండిపోయారు.