ఆంధ్రప్రదేశ్‌

దీక్షితులు వ్యాఖ్యల వెనుక బీజేపీ, వైసీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 17: తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రధానార్చకుడు రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యల వెనుక వైకాపా, బీజేపీల హస్తం ఉందన్న అనుమానాన్ని టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయం ఆవరణలోని అసెంబ్లీ టీడీఎల్పీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏవైనా అజెండాలుంటే ఏదో పార్టీలో చేరి మాట్లాడాలని సూచించారు. ఓ ప్రముఖ దేవాలయానికి ప్రధానార్చకుడిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేవస్థానం పవిత్రతకు భంగం కలుగుతుందని వ్యాఖ్యానించారు. గుంటూరు ఘటనలో కొంతమంది అరాచక శక్తులతో పోలీస్ స్టేషన్‌పై దాడి చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రతిపక్ష నేత సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.