ఆంధ్రప్రదేశ్‌

జల రవాణాకు రెగ్యులేటరీ అథారిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 18: రాష్ట్రంలో జల రవాణా కోసం ప్రత్యేక రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని, ఇందుకు సంబంధించిన విధి విధానాలను తక్షణమే రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో బోటు ప్రమాదాల నివారణపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న బోటు ప్రమాదాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై రాష్ట్రంలో బోటు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందుకోసం జలవనరులు, పోర్టు, టూరిజం, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు జల రవాణా జరిగే ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆయా బోట్లను తనిఖీ చేయాలన్నారు. ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీచేయాలన్నారు. బోట్లలో లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. లైసెన్సులు, రిజిస్ట్రేషన్ కాపీలు అందరికీ కనిపించేలా బోట్లలో ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైవర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎస్ ఆదేశించారు. ముఖ్యంగా రాష్ట్రంలో జల రవాణా కోసం ప్రభుత్వం ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ రెగ్యులేటరీ అధారిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు. ఈ అథారిటీ కేవలం జల రవాణాను మాత్రమే పర్యవేక్షిస్తుందన్నారు. మరింత సమాచారానికి ఇతర రాష్ట్రాల్లో జల రవాణా కోసం అమలవుతున్న నిబంధనలను పరిశీలించాలన్నారు. 10 మెట్రిక్ టన్నుల బరువు మోయగలిగే లాంచీలకు జలవనరులశాఖ, ఆపై బరువులు మోయగలిగే వాటికి పోర్టు అధికారులు అనుమతులివ్వాలని దిశ నిర్దేశం చేశారు. ప్రయాణికుల పడవలకు పోర్టు అధికారులు అనుమతులివ్వాలన్నారు.