ఆంధ్రప్రదేశ్
సీఎంఏ ఫైనల్లో విజయవాడ వాసికి ఆలిండియా 38వ ర్యాంక్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 July 2018
విజయవాడ, జూలై 10: రాష్ట్ర రాజధాని విజయవాడ నగరానికి చెందిన నిమ్మగడ్డ వెంకట కృష్ణారావు ‘కాస్ట్ అండ్ ఎకౌంట్ మేనేజ్మెంట్‘ (సీఎంఏ) ఫైనల్ పరీక్షలో జాతీయ స్థాయిలో 38వ ర్యాంక్ సాధించాడు. ఆయన తండ్రి భానుప్రసాద్ ప్రస్తుతం ఇంజనీర్గా సేవలందిస్తున్నారు. తాత దివంగత వెంకట కృష్ణారావు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా కృష్ణారావును మంగళవారం కోల్కత్తాలోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ విద్యార్థుల స్నాతకోత్సవ సభలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి సోవందేల్ ఛతోపాధ్యాయ ఘనంగా సత్కరించారు. ఈ నెల 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జ నిమ్మగడ్డ కృష్ణారావు రాష్టప్రతి చేతుల మీదుగా సత్కారం పొందనున్నారు.