ఆంధ్రప్రదేశ్‌

రూ.1000 కోట్లతో ఎస్సీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్: రావెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 5: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1000 కోట్లతో ఎస్పీ కార్పొరేషన్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. విశాఖలోని ఎస్సీ హాస్టల్‌ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొన్ని న్యాయ సంబంధమైన చిక్కుల కారణంగా యాక్షన్ ప్లాన్ అమల్లో జాప్యం చోటుచేసుకుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 83వేల మందికి ఆర్థిక సహకారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గిరిజనుల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గిరిజన యువతకు వృత్తివిద్యలో శిక్షణనిచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. విశాఖ నగరంలో 10 ఎకరాల్లో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తున్నామన్నారు.