ఆంధ్రప్రదేశ్‌

ఆవులను కబేళాలకు తరలిస్తున్న ముఠా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 5: మూగజీవాలను గుట్టుచప్పుడు కాకుండా కబేళాలకు తరలిస్తున్న ఓ ముఠా రేణిగుంట, తిరుపతి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రోడ్లపై సంచరిస్తున్న ఆవులను ఈ ముఠాకు చెందిన వ్యక్తులు ఎవరికీ అనుమానం రాని రీతిలో ఊరుబయటకు తోలుకెళ్తారు. అక్కడ నుంచి రాత్రిపూట వాహనాల్లో కబేళాలకు తరలిస్తున్నారు. ముందుగా ఈ ముఠా సభ్యులు రేణిగుంట మండలంలో సంచరిస్తూ బలంగా ఉన్న ఆవులను ఎంచుకుంటారు. ఆపై ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. సమయం చూసుకొని వారు ఎంచుకున్న ఆవును సాధారణ పౌరులు ఆవులను తరిమినట్లుగా తరుముతారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆవును వదిలి అక్కడ వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తారు. అక్కడ ప్రజలెవ్వరూ తమను గమనించడంలేదని నిర్థారించుకున్న తరువాత తిరిగి ఆ ఆవును మరికొంత దూరం తీసుకెళ్లారు. ఇలా అంచెలంచెలుగా ఊరిబయటకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి ముందుగా సిద్ధంచేసుకున్న వాహనంలో ఆవును ఎక్కిస్తారు. ఎవరైనా అడిగితే తాము ఈ ఆవును కొనుగోలు చేశామని నమ్మబలుకుతారు. అలా ఆరోజు పరిస్థితిని బట్టి తమకు చిక్కిన 1నుంచి 3 ఆవులను వాహనంలో తరలిస్తారు.