ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక ప్రగతిపై మంత్రి సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 26: చిత్తూరు జిల్లాలో జరుగుతున్న పారిశ్రామిక ప్రగతిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి గురువారం సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భాగస్వామ్య సదస్సుల్లో, ఇతర వేదికలపై చేసుకున్న అవగాహనా ఒప్పందాలకు భూ కేటాయింపుల గురించి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నను అడిగి తెలుసుకున్నారు.
చిన్నపాండూరులో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ, ఆ ప్రాంతంలో భూమి తక్కువగా ఉండటంతో ఎవరైతే ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తారో వారికి భూమి కేటాయించాలని మంత్రి ఆదేశించారు.