ఆంధ్రప్రదేశ్‌

బీజేపీతో జగన్ రహస్య కాపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఆగస్టు 21: వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా పాదయాత్ర చేస్తున్నారని రాష్ట్ర గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని ఎన్‌డీఏతో టీడీపీ తెగదెంపులు చేసుకుని ధర్మపోరాటం చేస్తుంటే, జగన్ మాత్రం బీజేపీతో రహస్య కాపురం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకంచేసి పోరాటం చేస్తుంటే, నిందలు మోపడం జగన్‌కే చెల్లిందన్నారు. సచివాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును తిట్డడం, బురదచల్లటమే పనిగా జగన్ పాదయాత్ర కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. అసలు ఆ పాదయాత్రకు అర్థం ఉందా అని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో పాదయాత్రపై ప్రజల అభిప్రాయాలను ప్రశాంత్ కిషోర్‌ను అడిగి తెప్పించుకోవాలని సలహా ఇచ్చారు. నాడు ఏఐసీసీ అధినేత్రి సోనియాను ఎదిరించానని కడప ఉప ఎన్నికల్లో ప్రచారం చేసుకున్న జగన్ రాష్టప్రతి ఎన్నికల్లో ప్రణబ్‌ముఖర్జీకి ఎందుకు మద్దతు పలికారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పీఎంవోలో ఎ- 2 విజయసాయిరెడ్డితో రహస్య మంతనాలు చేయిస్తున్న వైకాపా తీరు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు.