ఆంధ్రప్రదేశ్‌

నేటినుంచి సంప్రదాయ ఆంధ్రా వంటకాల విందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: తెలుగుదనం ప్రతిబించించే వంటకాలను మరింతగా జన బాహుళ్యంలోకి తీసుకువెళ్లేలా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రా ఫుడ్ ఫెస్టివల్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. శాకాహారం కావచ్చు, మాంసాహారం కావచ్చు... రాష్ట్ర ప్రజలకు ప్రీతిపాత్రమైన వంటకాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని బహుళ ప్రాచుర్యం పొందినవి కాగా, మరికొన్ని అంతగా పర్యాటకుల దృష్టిని ఆకర్షించలేక పోయాయి. ఈ లోటును భర్తీ చేయాలన్న ధ్యేయంతో పర్యాటక శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోంది. పోషక విలువలతో కూడిన తెలుగు వంటకాలను ప్రపంచ పర్యాటకులకు చేరువ చేసే క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రా ఆహార పండుగలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు నగరంలోని ది క్యాపిటల్ హోటల్‌లో 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఆహార వేడుకను నిర్వహిస్తున్నట్లు ఏపీటీఏ సీఇఓ, ఏపీటీడీసీ ఎండీ హిమాన్హు శుక్లా సోమవారం తెలిపారు.
తెలుగు సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న మన ఆహారం గురించి నేటి తరంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులకు పరిచయం చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేపడుతుండగా, సంవత్సరిక ప్రణాళిక మేరకు రాష్టమ్రంతా కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భిన్న రకాల వంటకాల్లో పోషక విలువల పరంగా ఆంధ్రప్రదేశ్ వంటకాలు విభిన్నమైనవి. ఈ అంశాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావటమే ప్రధాన ధ్యేయంగా పర్యాటక శాఖ వినూత్న కార్యక్రమాన్ని తీసుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా బాధ్యతులు చేపట్టిన తదుపరి పర్యాటక శాఖ పరంగా వివిధ పనులు వేగం పుంజుకోగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనల మేరకు ఈ ఆంధ్రా ఆహార పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
ఈ నేపథ్యంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి మీనా మాట్లాడుతూ నిజానికి ఆంధ్రా వంటలు ఎంతో రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి కాగా నేటి యువతరం జంక్ ఫుడ్ వైపు ఆకర్షితులు అవుతూ అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు సైతం పర్యాటక శాఖ పరోక్షంగా సహకరిస్తుందన్నారు. మరోవైపు స్థానిక వంటకాలు ప్రసిద్ధ నొందినప్పటికీ పెద్దగా ప్రచారానికి నోచుకోని వంటకాలను గుర్తించి వాటికి కూడా ప్రాధాన్యత తీసుకువచ్చేలా పర్యాటక శాఖ ప్రణాళిక సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. తెలుగునాట సుప్రసిద్ధ వంటకాలకు కొదవ లేదని, కాకుంటే అవి కనుమరుగవుతున్నాయన్నారు.