ఆంధ్రప్రదేశ్‌

పీఎంఎంవీవైలో ఏపీ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంఎంవీవై) పథకం అమలులో దక్షిణాది నుంచి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ రాష్ట్రంగా ఎంపికైంది. లక్ష్యాన్ని చేరుకోవటమే కాకుండా అత్యున్నత ఫలితాల సాధనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సాధించింది. పీఎంఎంవీవై పథకం లక్ష్యాలను చేరుకోవటంలో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. లక్ష్యాల సాధనతో పాటు అత్యుత్తమ ఫలితాల సాధనలో కర్నూలు జిల్లా మరో కేటగిరిలో అవార్డు సొంతం చేసుకుంది. కేంద్ర ఫ్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ అవార్డులను ప్రకటించింది. పీఎంఎంవీవై కింద అత్యధిక సంఖ్యలో తల్లులకు కర్నూలు జిల్లాలో ప్రయోజనం చేకూరింది.
ఈ జిల్లా స్ఫూర్తిగా మిగిలిన జిల్లాలు కూడా మాతృమూర్తులకు పథకం ప్రయోజనాలను అందించటంలో పోటీపడాలని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. ఈనెల 7వ తేదీన డెహ్రాడూన్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం జరగనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సోమవారం ప్రకటన విడుదల చేసింది.