ఆంధ్రప్రదేశ్
కొట్టాయంలో ఏఐఎన్ఈఎఫ్ జాతీయ మహాసభలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 September 2018
విజయవాడ, సెప్టెంబర్ 8: కేరళలోని కొట్టాయం నగరంలో ఈ నెల 16 నుంచి మూడు రోజులపాటు ఆలిండియా న్యూస్ పేపర్ ఎంప్లారుూస్ ఫెడరేషన్ (ఏఐఎన్ఈఎఫ్) 11వ జాతీయ మహాసభలు జరుగుతాయని సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి వీ బాలగోపాలన్, సీనియర్ ఉపాధ్యక్షులు చలాది పూర్ణచంద్రరావు నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ సభలకు దేశం నలుమూలల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్రధానంగా జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకాన్ని వర్తింపచేయాలని, ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న వారిని కూడా వేతన సిఫార్సుల సంఘం పరిధిలోకి తీసుకురావాలనే అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుందని ఆపై సంఘ కార్యవర్గ ఎన్నికలు కూడా జరుగుతాయన్నారు.