ఆంధ్రప్రదేశ్‌

జీవీఎల్.. అవాస్తవాలు చాలిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అవాస్తవాలు మాట్లాడ్డం ఆపాలని ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య హితవు పలికారు. వాస్తవాలు విస్మరించి అవగాహనా రాహిత్యంతో అసత్యాలు ప్రచారం చేసి చంద్రబాబును కించపరిచేలా మాట్లాడుతూ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించటం జీవీఎల్‌కు మంచిది కాదన్నారు. దీనిద్వారా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీ మన్ననలు పొందాలనే ప్రయత్నం చేస్తున్న జీవీఎల్ రాజకీయ చరిత్రలో దగాకోరుగా మిగిలిపోతారన్నారు. ఈనెల 24న అమెరికాలో అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు ఉపన్యాసం చేయనుండగా జీర్ణించుకోలేక అక్కడి నుంచి వచ్చిన లేఖ కూడా బూటకమని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశానికి వెళ్తుంటే దాన్ని ఐక్యరాజ్య సమితి సమావేశమని చంద్రబాబు రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించారని గగ్గోలు పెట్టడం జీవీఎల్ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. నైతిక విలువలు ఉంటే వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.