ఆంధ్రప్రదేశ్‌

గ్రానైట్ ఫ్యాక్టరీ పైకప్పు కూలి ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, సెప్టెంబర్ 26:నిర్మాణంలో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ కుప్పకూలి ముగ్గురి మృతికి కారణమైన ఘటన ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం నక్కబొక్కలపాడు పంచాయతీ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో చెన్నుపల్లి గ్రామానికి చెందిన ఈపూరు ఏసుమరియమ్మ (37), నక్కలబొక్కలపాడుకు చెందిన గోగినేని పూర్ణమ్మ (40), అట్లూరి వెంకటేశ్వర్లు (58)మృతి చెందగా మరో పదిమందికి గాయాలు అయ్యాయి. నక్కలబొక్కలపాడుకు చెందిన గోరంట్ల రవి నిర్మిస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి లోపల యంత్రాలను బిగించాల్సిఉంది. ఈనేపధ్యంలో బుధవారం వీచిన స్వల్ప ఈదురుగాలులకు పేకమేడలా కూలిపోయింది. అందులో పనిచేస్తున్న పదిమంది కూలీలో ఏసుమరియమ్మ శిధిలాల కింద పడి మృతిచెందగా, అట్లూరి వెంకటేశ్వరరావును ఉన్నత చికిత్స నిమిత్తం నర్సారావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. వీరితోపాటు ఫ్యాక్టరీలో యజమాని గోరంట్ల రవితో పాటు మరో పదిమంది ఉన్నారు. వీరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అద్దంకి, నరసరావుపేట వైద్యశాలకు తరలించారు.