ఆంధ్రప్రదేశ్‌

రుషికొండ బీచ్‌లో ఐదుగురు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 30: విశాఖ రుషికొండ వద్ద బీచ్‌లో ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటకు రాగా, ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. వీరంతా విశాఖ గాయత్రి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న వారే కావడం గమనార్హం. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో హరికిరణ్, సిహెచ్.లీలా పవన్‌కుమార్, పడిశెట్టి దామోదర్, పడార రేవంత్‌రాజ్ వెంకటేష్, సిహెచ్.నాగవంశీ రుషికొండ బీచ్‌కు వెళ్లారు. వీరంతా బీచ్‌లో స్నానానికి వెళ్లగా అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. వీరిలో హరికిరణ్(18), లీలా పవన్‌కుమార్(18) జాడ తెలియలేదు. దామోదర్, పడాల రేవంత్‌రాజ్ వెంకటేష్, నాగవంశీలను స్థానికులు రక్షించారు. అయితే లీల పవన్‌కుమార్ మృతదేహం మాత్రం చాలాసేపటి తరువాత గుర్తించారు. హరికిరణ్ జాడ రాత్రి వరకూ తెలియలేదు. గజఈతగాళ్లు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది గల్లంతైన హరికిరణ్ కోసం గాలిస్తున్నారు. గల్లంతైన హరికిరణ్ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన వాడుగా తెలిసింది.