ఆంధ్రప్రదేశ్‌

రైతులపై లాఠీచార్జి దుర్మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 2: ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై పోలీసులు లాఠీ చార్జి చేయటం దుర్మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. గాంధీ జయంతి స్ఫూర్తిని కేంద్రప్రభుత్వం తుంగలో తొక్కడం దారుణమన్నారు. జైజవాన్..జైకిసాన్ అని నినదించిన లాల్‌బహదూర్‌శాస్ర్తీ ఆశయాలకు ఈ ఘటనతో తూట్లు పొడిచారని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్న కర్తతర్పణం చేయాల్సి రావటం గర్హనీయమన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించాల్సింది పోయి వారి రక్తం కళ్ల చూడటం అమానుషమన్నారు. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు, బీజేపీ నేతలు జరిగిన సంఘటనపై దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.