ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిబండ, అక్టోబర్ 7 : రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుడిబండ మండల పరిధిలోని జంబులబండ గ్రామంలో ఆదివారం ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రఘువీరా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాల గురించి ప్రజలకు వివరించారు. అలాగే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాధించింది ఏమీ లేదన్నారు.
గత నాలుగేళ్ల కాలంలో రాఫెల్ కుంభకోణం, జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు వంటివి అమలు చేసి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల వరకూ రుణమాఫీ, ఏడాదికి ఉచితంగా 4 సిలిండర్లు అందజేస్తామన్నారు. రఘువీరాతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.