ఆంధ్రప్రదేశ్‌

24, 25 తేదీల్లో కలెక్టర్ల సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లతో సదస్సును ఈ నెల 24, 25 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనుంది. ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో ఈ సదస్సు నిర్వహిస్తారు. వివిధ పథకాల అమలు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి, అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఇకపై ప్రతినెలా జిల్లా కలెక్టర్లతో సదస్సులు నిర్వహించాలని ఇప్పటికే సీఎం నిర్ణయించారు. ముందుగా ఈ సదస్సును ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించాలని ప్రతిపాదించినప్పటికీ, దసరా తరువాత నిర్వహించేందుకు ఎక్కువ మంది అధికారులు మొగ్గు చూపడంతో తాజాగా ఈ తేదీలను ఖరారు చేశారు.