ఆంధ్రప్రదేశ్‌

దుష్టత్రయం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్రాన్ని దుష్టత్రయమైన బీజేపీ, వైకాపా, జనసేన నుంచి కాపాడాలని ద్వారకా తిరుమల వెంకన్నను కోరుకున్నానని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి జవహర్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా అన్నదేవరపేట నుంచి ద్వారకా తిరుమలకు మూడు రోజుల పాటు 112 కిలోమీటర్ల మేర వేడుకోలు పాదయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన నేత పవన్ కల్యాణ తోలుబొమ్మలాట నుంచి, వైకాపా అధినేత జగన్ కుట్రల నుంచి ఏపీని కాపాడాలని పాదయాత్ర చేసి, వెంకన్నను వేడుకున్నట్లు తెలిపారు. తన యాత్రలో ప్రజలు భారీగా పాల్గొన్నారని తెలిపారు. వైఎస్ హయంలో ఆబ్కారీ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కారణంగా చాలా మంది అధికారులు పదోన్నతులు ఆగిపోయాయన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉన్నతాధికారులు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. వెంకన్న ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ 135 సీట్లు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.